Ram Charan | ఆస్కార్ అవార్డుల వేడుక మరి కొన్ని గంటల్లో జరగనున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం అమెరికాకు వెళ్లింది. అక్కడ వరుస ఇంటర్వ్యూలు , కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు చిత్ర బృందం. తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రంలో రామరాజుగా నటించిన చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ గురించి కూడా ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ గురించి చెర్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మార్వెల్ మూవీస్కు దర్శకత్వం వహిస్తే చూడాలని ఉందన్నారు చరణ్. అదే జరిగితే అప్పుడు అందరికీ పార్టీ ఇస్తానన్నారు.
‘రాజమౌళి మార్వెల్ మూవీస్కు డైరెక్షన్ వహించాలని ఆశిస్తున్నా. అదే జరిగితే.. అందరికీ పార్టీ ఇస్తా. నేను వాళ్ల ప్రతి సినిమాలోనూ ఉండాలని అనుకుంటా. ప్రస్తుతం చిత్రరంగానికి ఎలాంటి హద్దులూ లేవు. హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాల్లేవు. అలాంటి ఓ రంగంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా’ అని చరణ్ వ్యాఖ్యానించారు.
తండ్రి చిరంజీవి గురించి చెబుతూ.. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారన్నారు. ‘80వ దశకంలో ఓసారి ఆస్కార్ వేడుకకు నాన్న హాజరయ్యారు. అదే భారీ విక్టరీగా భావించారు. ‘నాటు నాటు’ ఆస్కార్కు నామినేట్ అయిందని తెలిసి ఎంతో ఆనందించారు. ఆస్కార్ కోసం కోట్లాది భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ అవార్డు మాకు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ లాంటిది’ అని చరణ్ పేర్కొన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!