Home Latest News Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Coronavirus | దేశంలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చాప కింద నీరులా సైలెంట్‌గా విస్తరిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 40 శాతం పెరిగి.. మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గురువారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 1,10,522 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,016 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాదాపు ఆరు నెలల తర్వాత కొవిడ్ కేసుల్లో ఈ స్థాయి వృద్ధి కనిపించింది. గత ఏడాది అక్టోబర్ 2న 3,375 కేసులు నమోదయ్యాయి. కాగా మళ్లీ ఇన్ని రోజులకు మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక బుధవారం నాడు 2,151 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం వృద్ధి కనిపించింది.

ప్రస్తుతం దేశంలో 13,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ రికవరీ రేటు 98.78 శాతంగా.. పాజిటివిటీ రేటు 2.7 శాతంగా ఉంది. ఇక గురువారం నాడు కరోనాతో 14 మంది మరణించారు. వీరిలో ఎనిమిది మంది కేరళ నుంచే ఉండటం గమనార్హం. మిగిలిన ఆరుగురిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఢిల్లీ నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌ డే.. వరల్డ్‌ ఇడ్లీ డేగా ఎలా మారింది?

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

Exit mobile version