Home Latest News IND vs AUS | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మనదే.. ‘డ్రా’గా ముగిసిన చివరి టెస్టు.. కోహ్లీకి...

IND vs AUS | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మనదే.. ‘డ్రా’గా ముగిసిన చివరి టెస్టు.. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను టీమ్‌ఇండియా వరుసగా నాలుగోసారి కైవసం చేసుకుంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సోమవారం ముగిసిన ఆఖరి టెస్టు ‘డ్రా’ కాగా.. రోహిత్‌ సేన 2-1తో ట్రోఫీ చేజిక్కించుకుంది. దీంతో పాటు మ్యాచ్‌ ఫలితం తేలకముందే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 3/0తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 175/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ట్రావిస్‌ హెడ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్నస్‌ లబుషేన్‌ (213 బంతుల్లో 63 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించారు. చివరి రోజు కూడా పిచ్‌ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించకపోగా.. బ్యాటర్లు స్వేచ్ఛగా ముందుకు సాగారు. భారత బౌలర్లలో అశ్విన్‌, అక్షర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఇరుజట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించారు. టెస్టు ఫార్మాట్‌లో మూడేండ్ల తర్వాత సెంచరీ చేసిన రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, సిరీస్‌లో 25 వికెట్లతో పాటు 86 పరుగులు చేసిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

రెండే వికెట్లు..

తొలి నాలుగు రోజుల తరహాలోనే సోమవారం కూడా పిచ్‌ పూర్తిగా నిర్జీవంగా కనిపించింది. సాధారణంగా భారత ఉపఖండంలో తొలి మూడు రోజులు పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించినా.. చివరి రెండు రోజులు మాత్రం కాస్త కూస్తో స్పిన్‌ అనుకూలిస్తాయి. కానీ అహ్మదాబాద్‌లో వినుత్నంగా స్పిన్నర్లు కనీస ప్రభావం చూపలేకపోయారు. చివరి రోజు ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనుకున్న భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. తొలి నాలుగు రోజుల్లానే పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించడంతో ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడింది. రెండు సెషన్‌లకు పైగా బౌలింగ్‌ చేసిన మనవాళ్లు రెండే వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. నైట్‌వాచ్‌మన్‌ కునేమన్‌ను అశ్విన్‌ను ఔట్‌ చేసినా.. హెడ్‌, లబుషేన్‌ కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడలేదు. అప్పటికే ఆశలు సన్నగిల్లగా.. అహ్మదాబాద్‌లో విపరీతమైన వేడితో ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version