Rythu bandhu | తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచి యాసంగికి పెట్టుబడి సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ఆదేశించారు.
రైతుబంధు నిధులను ఎప్పటిలాగే వరుస క్రమంలో జమ చేయనున్నారు. ఎకరం విస్తీర్ణం నుంచి మొదలుపెట్టి పెట్టుబడి సాయాన్ని బ్యాంకు అకౌంట్లో వేయనున్నారు. యాసంగి సీజన్ కింద రైతు బంధు నిధుల కోసం రూ.7600 కోట్లను అందించనున్నారు.
కొమురవెల్లి మల్లన్నకు కోటి విలువైన కిరీటం
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణోత్సవం ఆదివారం కన్నులపండుగగా సాగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి హరీశ్ రావు పాల్గొన్నారు. కల్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతో పాటు రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో జాతర అంటే మల్లన్న జాతరే అని తెలిపారు. వచ్చే ఏడాది మేడమ్మకు, ఖేతమ్మకు సైతం బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు.
Read More Articles |
Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?
Macherla | రణరంగంగా మారిన మాచర్ల.. టీడీపీ, వైసీపీ శ్రేణుల వీరంగంతో హైటెన్షన్..