Preliminary key | ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91 శాతం అభ్యర్థులు హాజరైనట్లు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. అయితే పరీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే పరీక్ష ‘కీ’ని కూడా విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ముందుగా చెప్పినట్లుగానే ‘కీ’ కూడా విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- జనవరి 25 లోపు ఎవరికైనా కీ మీద అభ్యంతరాలుంటే మెయిల్ చేయొచ్చంటూ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను పోలీసు నియామక మండలి ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహించారు. పోలీసు ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితిని పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!
viral news | బాపట్ల జిల్లాలో 25 అడుగులు వెనక్కి జరిగిన బిల్డింగ్
Tirumala | తిరుమలలో డ్రోన్ వీడియో కలకలం.. స్పందించిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
TTD | సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్.. మండిపడుతున్న భక్తులు