Tirumala | తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. డ్రోన్ కెమెరాతో తీసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను పెట్టినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
పటిష్ఠ భద్రత ఉన్న ఆలయంపై వీడియో తీసే అవకాశం లేదన్న సుబ్బారెడ్డి.. ఫొటోలతో యానిమేట్ చేశారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ విజువల్స్ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అయితే డ్రోన్ విజువల్స్ విషయంలో టీటీడీ సీిరియస్ అయింది. భద్రతా వైఫల్యాలపై ఆరా తిసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలా డ్రోన్ వీడియో చిత్రీకరించడం, అది వైరల్గా మారడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్
SBI | ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?
TTD | సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్.. మండిపడుతున్న భక్తులు
Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?