Rahul Gandhi | ఎంపీగా అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. సారి చెప్పేందుకు నేను సావర్కర్ను కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ, ప్రధానిని ప్రశ్నించినందుకే తనపై అనర్హత వేటు వేశారని అన్నారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినా పోరాటాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్న రాహుల్ గాంధీ.. తన జీవితకాలం నిషేధం విధించినా పోరాటం మాత్రం ఆగదన్నారు. అదానీ-మోదీ బంధంపై పక్కా ఆధారాలు స్పీకర్కు ఇచ్చానంటూ సంచలన విషయాలు చెప్పారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అదానీ షెల్ కంపెనీల్లోకి రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రశ్నించడమే తాను చేసిన నేరమా అంటూ వ్యాఖ్యానించారు. అదే అయితే ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ దేశం నాకు చాలా ఇచ్చిందని.. అందుకే ప్రశ్నించడం ఆపను అన్నారు. బ్రిటన్లో తాను అనని మాటలను అన్నట్లు వక్రీకరించారని ఆరోపించారు. మీ నాయకుడు ప్రధాని మోదీని కాపాడుకోవచ్చు కానీ అదానీని ఎందుకు కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుందంటూ ప్రశ్నించారు.
మోదీ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పగలరా అన్నారు. తాను జైలుకు వెళ్లినా బయపడేది లేదన్నారు. తనకు బీజేపీ వేసింది శిక్ష కాదని, అవకాశం అంటూ మాట్లాడారు. ” నిజం మాట్లాడటం నేను చేసే తపస్సు. నేను నిజమే మాట్లాడుతా. విపక్ష నేతలంతా ఏకమవుతాం కలిసి పోరాడుదాం” అంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు
Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి
Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!
Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్పుర్ గ్రామస్థులు!