Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్సభ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు లోక్సభ జనరల్ సెక్రటరీ ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. ఇకపై రాహుల్ గాంధీ మాజీ ఎంపీ అవుతారని, నిన్నటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
2019 కర్నాటక ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీ ఇంటిపేరు ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సూరత్ కోర్టు నాలుగేళ్ల విచారణ జరిపి రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్లు, ఆపైన జైలు శిక్ష పడితే అనర్హత వేటు వేయొచ్చు.
అనర్హత వేటు పడితే ఏమౌతుంది..
ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం చట్ట సభ సభ్యులకు రెండేళ్లు, ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు వేయొచ్చు. జైలు శిక్ష అనంతరం మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి
Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!
Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్పుర్ గ్రామస్థులు!