Borugadda Anil | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మొదలైన రచ్చ రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి బయటకొచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి కార్యాలయానికి దుండగులు నిప్పుబెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇటీవల ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. కోటంరెడ్డికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏపీ సీఎం జగన్, సజ్జల జోలికి వస్తే బండికి కట్టుకుని నెల్లూరు వీధుల్లో లాక్కొని వెళ్తానని హెచ్చరించాడు. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదని.. ఐదు నిమిషాల్లో వచ్చేసి లాక్కెళ్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై మరుసటి రోజే కోటంరెడ్డి కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బెదిరింపులతో తన గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గుంటూరులోని డొంక రోడ్డులో ఉన్న బోరగడ్డ అనిల్ క్యాంపు కార్యాలయంపై కొందరు దుండగులు పెట్రోల్ చల్లి నిప్పంటించారు. దీంతో అక్కడి ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.
దీనిపై బోరగడ్డ అనిల్ కుమార్ స్పందించాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనే అని అతను ఆరోపించాడు. ఇందుకు గుంటూరు టీడీపీ నేతలు సహకరించారని అన్నారు. కోటంరెడ్డి, టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఏపీ సీఎం జగన్ను కోరాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..
Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా
BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్