Revanth Reddy | తెలంగాణలో మార్పు రావాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ములుగులో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజ చేసిన అనంతరం రేవంత్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంపన్న వాగు నీళ్లు తాగిన ప్రజలు.. ప్రభుత్వంపై పౌరుషం చూపించే సమయం ఆసన్నమైందని తెలిపారు.
కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇల్లు ఎవరికైనా వచ్చాయా అని ములుగు ప్రజలను ప్రశ్నించారు. 25 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే మార్పు రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వం మారాలని.. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే మార్పు రావాలని అన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Telangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టిన హరీశ్ రావు
Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు