Ponguleti Srinivas reddy | బీఆర్ఎస్ అధిష్టానంపై ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వరం పెంచారు. తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ” నాతో సన్నిహితంగా ఉన్నవారిని నా వెన్నంటే ఉండే వారిని తొలగించడం కాదు.. దమ్ముంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి” అంటూ సవాల్ విసిరారు.
మొన్నటివరకు పార్టీ కార్యక్రమాలన్నింటికీ ఆహ్వానాలు పంపి.. ఇప్పుడు తన అనుచరులను సస్పెండ్ చేయడం ఏందని ప్రశ్నించారు. ఖమ్మంలో గెలవడం కోసం నన్ను పట్టుకుని ప్రాధేయపడ్డారని గుర్తు చేశారు. ” నాకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని అంటున్నారు.. మరి అలాంటప్పుడు డిసెంబర్ వరకు జరిగిన పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ నా చిత్రాన్ని ఎందుకు ఉంచారు” అంటూ ప్రశ్నించారు.
- నన్ను నమ్ముకున్న అభిమానుల ఇష్టం మేరకే నేను పార్టీ మారుతానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న ఆరోపణలతో పొంగులేటి అనుచరులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశాలతో బహిష్కరణ వేటు వేస్తున్నట్లు పార్టీ వైరా మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, వైరా పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ ప్రకటించారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్తో పాటు 20 మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై పొంగులేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Telangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టిన హరీశ్ రావు
Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు