Rohit Shetty | బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలిం సిటీలో ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఆయన ప్రమాదానికి గురయ్యాడు. దీంతో హుటాహుటిన ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్ కోసం దాదాపు 20 కోట్లు ఖర్చుచేస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కారు ఛేజింగ్ సీన్ తీస్తుండగా రోహిత్ శెట్టి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలు కావడంతో రోహిత్ శెట్టిని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రోహిత్ శెట్టికి మైనర్ సర్జరీ నిర్వహించినట్టు తెలుస్తోంది.
జమీన్ చిత్రంతో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి గోల్మాల్, సింగం సిరీస్లతో మంచి పాపులర్ అయ్యాడు. యాక్షన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.
Read More Articles:
Rishabh Pant | రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన.. మోకాలి లిగ్మెంట్ చికిత్స సక్సెస్
Kerala Biryani | బిర్యాని తిని 20 ఏళ్ల యువతి మృతి.. వారంలో ఇది రెండో ఘటన.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
Sankranti Holidays | గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం