Home News AP Andhra pradesh | 2024లో ఓడిపోతే అమరావతిలోనే ఉంటావా? వైఎస్ జగన్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్...

Andhra pradesh | 2024లో ఓడిపోతే అమరావతిలోనే ఉంటావా? వైఎస్ జగన్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Andhra pradesh | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్. జగన్ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటారన్న గ్యారెంటీ ఉందా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఏపీలో ఐటీ రంగం కుదేలైందన్నారు. ఏపీలో ఉన్నకంపెనీలను తరిమేయాలన్న ఆలోచన తప్పితే కొత్త కంపెనీలను తెచ్చి ఏపీలో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదంటూ మండిపడ్డారు.

ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 0.1 శాతం మాత్రమేనని, రాష్ట్రంలో ఐటీ కుదేలైందని జీవీఎల్ విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. ఉన్న కంపెనీలను తరిమేయడం తప్ప.. కొత్త కంపెనీలను తెచ్చి రాష్ట్రంలో ఐటీని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఎందుకు చేయట్లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 15 శాతం మంది యువత ఐటీ రంగం వైపు ఆసక్తి చూపిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయట్లేదని మండిపడ్డారు.

తెలుగు దేశం పార్టీ, వైకాపాలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందని తీవ్రస్థాయిలో జీవీఎల్ విమర్శించారు. లేదంటే హైదరాబాదే గుర్తొస్తుందన్నారు. వైఎస్ జగన్ కామెంట్స్‌ని ఊటంకిస్తూ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి ఉంటుందన్న మాటకు కట్టుబడి లేని జగన్.. 2024 ఎన్నికల్లో ఓడిపోతే అమరావతిలోనే ఉంటారన్న గ్యారెంటీ ఏముందన్నారు. దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

AP CM Jagan | ఏపీ సీఎం జగన్‌కు కోపమొచ్చిందా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అంతలా మాటలన్నాడు!

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version