Home Latest News Tripura | బీజేపీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయి.. త్రిపుర సీఎం మాణిక్ సాహా సంచలన వ్యాఖ్యలు

Tripura | బీజేపీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయి.. త్రిపుర సీఎం మాణిక్ సాహా సంచలన వ్యాఖ్యలు

Tripura CM Manik Saha

Tripura | బీజేపీలో చేరి పాపాలు కడిగేసుకోవాలంటూ త్రిపుర సీఎం మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, అలాగే బీజేపీలో చేరితే పాపాలు తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపురలోని కక్రాబన్‌లో జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

స్టాలిన్, లెనిన్ ఐడియాలజీని నమ్మేవారు బీజేపీలో చేరాలన్నారు. బీజేపీ గంగానదిలాంటిదని, ఇందులో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయంటూ వ్యాఖ్యానించారు. ఈ రైలులో బోగీలు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, వచ్చి ఖాళీగా ఉన్న బోగీల్లో కూర్చోవాలని పిలుపునిచ్చారు. ఇందులో మనం వెళ్లాల్సిన గమ్యానికి ప్రధాని మోదీ మనల్ని తీసుకెళ్తారంటూ వ్యాఖ్యానించారు. విపక్ష సీపీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టుల హయాంలో ప్రజాస్వామ్యమంటూ లేదని, వారికి హింస, టెర్రర్ విధానాలు మాత్రమే తెలుసని అన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసి ఏండ్ల తరబడి త్రిపురను కమ్యునిస్టులు పాలించారని వ్యాఖ్యానించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Weather Effect | పంజా విసురుతున్న చలి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Fog Effect | పొగమంచు ఎఫెక్ట్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు

Exit mobile version