Home News International Pakistan | మసీదులో బాంబు పేలి 17 మంది దుర్మరణం.. 95 మందికి గాయాలు

Pakistan | మసీదులో బాంబు పేలి 17 మంది దుర్మరణం.. 95 మందికి గాయాలు

Pakistan | పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఓ మసీదులో బాంబు పేలింది. మధ్యాహ్నం ప్రార్థనా సమయంలో బాంబు పేలడంతో 17 మంది దుర్మరణం చెందారు. 95 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మసీదు భవనంలో కొంత భాగం కుప్పకూలింది. దీంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Exit mobile version