SSC Exams Schedule | ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఏపీలో పరీక్షల షెడ్యూల్ ఇదే..
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లీష్
ఏప్రిల్ 10 గణితం
ఏప్రిల్ 13 సామాన్య శాస్త్రం
ఏప్రిల్ 15 సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 17 కాంపోజిట్స్ కోర్సు
ఏప్రిల్ 18న ఒకేషనల్ కోర్సు
తెలంగాణలో పరీక్షల షెడ్యూల్ ఇదే..
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 ఇంగ్లీష్
ఏప్రిల్ 8 గణితం
ఏప్రిల్ 10 సామాన్య శాస్త్రం
ఏప్రిల్ 11 సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 12 ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
ఏప్రిల్ 13 ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
Read More Articles |
Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!
Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు