Home News AP Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ...

Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు

Yamini Sharma | ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ మహిళా మోర్చా ఏపీ అధ్యక్షురాలు యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాదుడే బాదుడు అన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక గుంజుడేగుంజుడు ప్రారంభించాలని విమర్శించారు.

ఏపీలో వైకాపా ప్రభుత్వం ఇచ్చేది పావలా అయితే వసూలు చేసేది రూపాయి అని మండిపడ్డారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన యామినీ శర్మ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గత తెలుగు దేశం, ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పేర్లు మార్చుకుందని విమర్శించారు. ఏపీలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందని విమర్శించారు.

ఏపీలో కేంద్రం ఇప్పటివరకు 45 లక్షల మరుగుదొడ్లు నిర్మించిందిని, కానీ ఏపీ సర్కారు వాటిపైనా పన్నులు విధిస్తూ వేధిస్తోందని ఆరోపించారు. జగన్ సర్కారు చెత్తను కూడా వదలడం లేదని, దానిపైనా పన్నులు వేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌పై కొన్ని రాజకీయ పార్టీలు అనవసరం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని యామినీ శర్మ మండిపడ్డారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kotamreddy Sridhar Reddy | ఇకపై ఒంటరిగా తిరుగుతా.. తగ్గేదేలే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్

Kotamreddy Sridhar Reddy | ముందు నీ మీద ఉన్న కేసుల సంగతి చూసుకో.. కాకాణిపై కోటంరెడ్డి ఫైర్!

Vallabhaneni Vamsi | డొక్క పగలదీస్తా.. మా గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు..వైసీపీ నేతలపై వల్లభనేని వంశి ఫైర్

Tarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన విజయసాయిరెడ్డి

Exit mobile version