Home Latest News Accident | బస్సు, కారు ఢీ.. 9 మంది మృతి.. 32 మందికి గాయాలు

Accident | బస్సు, కారు ఢీ.. 9 మంది మృతి.. 32 మందికి గాయాలు

Accident | గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్‌సారి సమీపంలో శనివారం ఉదయం కారును బస్సు ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. మరో 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మృతి చెందిన తొమ్మిది మంది మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో కారులో 9 మంది ఉన్నారని, వారిలో 8 మంది స్పాట్‌లోనే చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కూడా మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న 9 మంది అంక్లేశ్వర్‌కు చెందిన వారని వెల్లడించారు.

ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

WHO on Corona Cases | ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే ఛాన్స్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Exit mobile version