America Mega Million Jackpot | కొందరికి అదృష్టం ఎలా తలుపు తడుతుందో తెలియదు. ఏమీ లేని వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడైపోతాడు. అలాగే అమెరికాలోని ఓ వ్యక్తిని లక్ష్మీదేవి కరుణించడంతో రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. కేవలం 162 రూపాయలతో లాటరీ టికెట్ కొంటే రూ.10వేల కోట్ల లాటరీ తగిలింది.
అమెరికా మెగా మిలియన్స్ జాక్ పాట్లో అమెరికాలోని మైనే పట్టణంలోని లెబనాన్కు చెందిన వ్యక్తి రూ.162 పెట్టి టికెట్ కొన్నాడు. లాటరీలో అతనికి రూ.10,973 కోట్ల లాటరీ తగిలింది. ఇప్పటివరకు లాటరీ టికెట్ కొన్న వ్యక్తి పేరును మాత్రం నిర్వహకులు బయటపెట్టలేదు. సాధారణంగా అమెరికా లాంటి దేశాల్లో 13వ తేదీ శుక్రవారం వస్తే అన్ లక్కీ డేగా భావిస్తారు. కానీ అందరూ అన్ లక్కీ డేగా భావించే 13వ తేదీన ఆ వ్యక్తి మాత్రం బిలియనీర్ అయ్యాడు.
జనవరి 13న మెగా మిలియన్స్ జాక్ పాట్ తీసిన డ్రాలో లెబనాన్కు చెందిన వ్యక్తి కొన్న టికెట్ లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోయాయి. దీంతో అతన్ని విజేతగా ప్రకటించారు. అయితే అతడు గెలుచుకున్న లాటరీ మొత్తాన్ని 29 ఏళ్లపాటు చెల్లించనున్నారు. ఒకే సారి కావాలంటే మాత్రం రూ.7వేల కోట్లు మాత్రమే ఇస్తారు. అయితే చాలా మంది వాయిదా పద్ధతిలో కాకుండా ఒకేసారి తీసుకుంటారు. ఇప్పటివరకు అమెరికా మెగా మిలియన్ జాక్పాట్లో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడం ఇది నాలుగోసారి అని నిర్వహకులు తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం