Tourist places in Goa | ఈ గ్రామం నెల రోజులే కనిపించడం ఏంటనుకుంటున్నారా? దీనికో ప్రత్యేకత ఉంది కాబట్టే ఇలా చెప్పుకుంటున్నాం. గోవాలోని కుర్ది గ్రామం ఏడాదిలో ఒక నెల మాత్రమే కనిపిస్తుందట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఏడాదిలో 11 నెలల పాటు గోవాలోని కుర్ది గ్రామం నిటిలో మునిగి ఉంటుంది. ఒక నెల మాత్రం పైకి కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఎందుకు అలా.. ఏంటనే విషయాలపై ఓ సారి లుక్కేయండి..
గోవాలోని పశ్చిమ కనుమల్లో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రాంతంలోనే కుర్ది అనే గ్రామం ఉంటుంది. ఒకప్పుడు ఆ గ్రామం అన్ని ఊర్లలానే ఉండేది. కానీ 1986లో సలౌలిం నదిపై ఆనకట్ట కట్టారు. దాంతో ఆ గ్రామం పూర్తిగా నీటి మునిగింది. ఏడాదిలో 11 నెలల పాటు గ్రామం నీటిలోనే మునిగి ఉంటుంది. వేసవిలో ఒక నెల మాత్రమే తేలుతుంది.
వేసవిలో అక్కడి జలాశయంలో నీరంతా ఇంకిపోవడం వల్ల గ్రామం బయటపడుతుంది. ఆ టైంలో ఆ గ్రామానికి చెందిన ప్రజలు, పర్యాటకులు నెల రోజుల పాటు అక్కడ సంబురాలు చేసుకుంటారట. అక్కడున్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గోవాకు వచ్చిన దేశ, విదేవీ పర్యాటకులు కూడా ఆ గ్రామాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారట. అక్కడ విందులు, వినోదాల్లో మునిగిపోతారట. వర్షాకాలం ప్రారంభంకాగానే.. కొత్త నీళ్లు వచ్చినా కొద్దీ క్రమంగా కుర్ది గ్రామం దీవిలా మారిపోతుంది. ఆ టైంలో ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, గ్రామస్తులు ఎగబడతారట. అదే గోవాలోని కుర్ది ప్రత్యేకత.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే