India Vs New Zealand | రాయ్పూర్ వేదికగా భారత్తో జరగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. 34.3 ఓవర్లకే 108 పరుగులకు ఆలౌట్ చేశారు.
కివీస్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఫిలిప్స్ అత్యధికంగా 36 పరుగులు చేయగా.. మైఖేల్ బ్రాస్ వెల్ 22 పరుగులు, మిచెల్ శాంటర్న్ 27 పరుగులు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కేవలం 15 పరుగులకే కుప్పకూలింది. ఫిన్ అలెన్ డక్ ఔటయ్యాడు. డెవాన్ 7 పరుగులు, హెన్రీ రెండు, డారిల్ మిచెల్ 1, లేథమ్ ఒక పరుగు మాత్రమే చేశారు.
భారత బౌలర్లలో షమీ మూడు, హార్దిక్ పాండ్య , వాషింగ్టన్ సుందర్ 2, సిరాజ్, శార్దూల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీయడంతో 34.3 ఓవర్లకే న్యూజిలాండ్ కుప్పకూలింది. వన్డేల్లో భారత్పై కివీస్కు ఇది మూడో అత్యల్ప స్కోరు కావడం విశేషం. 2010లో చెన్నైలో జరిగిన వన్డేలో 103 పరుగులకే చేతులెత్తేసింది. 2016లో విశాఖ పట్నం వేదికగా కేవలం 79 పరుగులకే ఆలౌటైంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hyundai grand i10 | తక్కువ ధరకే కారు కావాలా? 6 లక్షల లోపే వస్తున్న ఈ కారుపై ఓ లుక్కేయండి
Uppal Match | ఉప్పల్లో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్పై భారత్ ఘన విజయం
Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్