viral news | ఐఫోన్లు కొనేందుకు కిడ్నీలు అమ్ముకున్న వాళ్ల గురించి విన్నాం. మద్యం కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకున్న వాళ్ల గురించి విన్నాం. కానీ ఓ మహిళ విలాసాల కోసం తన అండాలను అమ్ముకుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఈ విషయం భర్తకు తెలియడంతో వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ ఏకంగా భర్తనే చంపేస్తానని బెదిరించింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లో వెలుగు చూసింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనిత అనే మహిళకు ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి అత్తమామలతో తరచూ ఆమె గొడవపడేది. దీంతో వేరు కాపురం పెట్టడానికి భర్త మీద ఒత్తిడి తెచ్చింది. అనిత ఒత్తిడితో తల్లిదండ్రులకు దూరంగా ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.
తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆదాయం సరిపోవడం లేదని భర్తతో రోజూ గొడవకు దిగేది. అనిత వేధింపులకు విసిగిపోయిన ఆమె భర్త.. 2019లో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయాడు. అనిత పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇరు కుటుంబాలు వారి మధ్య సయోధ్య కుదర్చి పంపించారు.
అయితే భార్య విలాసవంతమైన జీవితాన్ని చూసి భర్తకు ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఆరా తీయగా విలాసాలకు అలవాటు పడి డబ్బుల కోసం తన అండాలను అమ్ముకుంటున్నట్లు తెలిసింది. దీనికి అనిత తల్లి సహకరిస్తుందని తెలిసింది. అహ్మదాబాద్లోని ఓ ఏజెంట్ సహాయంతో అండాలు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే విషయమై అనితను నిలదీశాడు.
దీంతో అనిత మరింత రెచ్చిపోయింది. భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని భర్తను బెదిరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకొని అనిత అండాలను అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల విచారణలో తన భర్త అనుమతితోనే అండాలను అమ్ముకుంటున్నట్లుగా నకిలీ పత్రాలు కూడా సృష్టించినట్లు తేలింది. 2019 నుంచి 2022 వరకు చాలా సార్లు ఆమె అండాలను విక్రయించినట్లు విచారణలో తేలింది. దీంతో అనిత మీద ఫోర్జరీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్