Home Latest News T20 world cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. హోరాహోరి పోరులో UAEపై నెదర్లాండ్స్...

T20 world cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. హోరాహోరి పోరులో UAEపై నెదర్లాండ్స్ విజయం

T20 world cup | టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ తొలి మ్యాచ్ లోనే విజయం సాధించింది. అంతకుముందు టోర్నీలోని తొలి మ్యాచ్లో శ్రీలంకపై నమీబియా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తొలి రౌండ్ గ్రూప్ ఏ మ్యాచ్ లో యూఏఈపై నెదర్లాండ్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

హోరాహోరీగా సాగిన పోరులో ఒక బంతి మిగిలి ఉండగానే నెదర్లాండ్స్ లక్ష్యాన్ని చేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. వసీం 47 బంతులాడి 41 పరుగులు చేయడంతో స్కోరు సెంచరీ దాటింది. 91 పరుగులకు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయిన యూఏఈ.. నెదర్లాండ్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్వల్ప వ్యవధిలోనే మరో 6 వికెట్లు కోల్పోయింది.

Read more: T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

112 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్ చేదనలో తడబడింది. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ విలవిలలాడింది. చివరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో మ్యాక్స్ 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. యూఏఈ బౌలర్ బాస్ డీ లీడ్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫ్రెడ్ క్లాసెన్ 13 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డును బాస్ డీ లీడ్ అందుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read more articles:

T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

T20 world cup | తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. పసికూన నమీబియా చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక

Exit mobile version