Rishab Pant | న్యూ ఇయర్కు ముందు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఇటీవల పంత్ కి చేసిన మోకాలి శస్త్ర చికిత్స కూడా విజయవంతమైనట్లు ఓ అధికారి వెల్లడించారు. దీంతో మరో వారం రోజుల్లోనే అతను డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం.
”రిషబ్ క్రమంగా కోలుకుంటున్నాడు. మొదటి సర్జరీ విజయవంతమైనట్లు వైద్యుల బృందం తెలిపింది. అభిమానులందరూ తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఇది. ఈ వారంలోనే అతడు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేయనున్నాడు. మార్చిలో మరో సర్జరీ అవసరం కావచ్చు. అది ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా వైద్యులు నిర్ణయిస్తారు. త్వరలోనే అతడు పూర్తి రికవరీతో మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నామని’ బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. పంత్ పూర్తిగా గ్రౌండ్లోకి రావడానికి 7 నుంచి 8 నెలల సమయం పట్టొచ్చని వివరించారు.
క్రిస్మస్ సందర్భంగా దుబాయిలో ధోనీ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపిన రిషబ్ పంత్ న్యూఇయర్ వేడుకలను తన ఫ్యామిలీతో గడిపేందుకు ఇండియా వచ్చాడు. వాళ్ల అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి రూర్కీకి ఒంటరిగానే కారులో బయల్దేరాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు రిషబ్ పంత్ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగాయి. అయితే అద్దం పగులగొట్టుకుని బయటకు దూకేడయంతో రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రమాదంలో పంత్ తల, కాలు, వీపుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో డెహ్రాడూన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్స్లామ్తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు
India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్పై భారత్ విజయం.. సిరీస్పై ఆశలు
India Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం 100 పరుగులే
Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం
Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్గా సబలెంకా!