Kerala | మీ అకౌంట్లో పొరపాటున డబ్బులు పడ్డాయనుకో ఏం చేస్తారు? బ్యాంకు వాళ్లకు సమాచారం అందించడమో లేదా కొద్దిరోజులు వేచి చూడటమో చేస్తారు. అలాగే కేరళలోని త్రిసూర్కు చెందిన ఇద్దరు యువకుల అకౌంట్లలో రూ.2.44 కోట్లు జమ అయ్యాయి. కానీ వాళ్లు బ్యాంకు వాళ్లకు సమాచారమివ్వలేదు. బ్యాంకు వాళ్లు గుర్తించేలోగా రెచ్చిపోయారు. విచ్చలవిడిగా ఖర్చు చేశారు. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది.
వాళ్లు ఖర్చు చేసిన విధానం చూసి బ్యాంకు సిబ్బందే కాదు పోలీసులు కూడా షాక్ అయ్యారు.
ఇద్దరి యువకుల అకౌంట్లలో రూ.2.44 కోట్లు పడగానే కొంత డబ్బు విత్డ్రా చేసి వాళ్లకున్న అప్పులు తీర్చేశారు. ఖరీదైన నాలుగు ఐఫోన్లు కొన్నారు. స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టేశారు. మిగిలిన డబ్బును వేరే ఖాతాల్లోకి మళ్లించారు. బ్యాంకు సిబ్బంది గుర్తించేలోగా రెండున్నర కోట్లు ఇట్టే ఖర్చు చేశారు. బ్యాంకులో సాంకేతిక సమస్య వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని వారి ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలని సిబ్బంది చూశారు.
కానీ అప్పటికే వారి ఖాతాల్లో డబ్బులేం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి కోసం 19 బ్యాంకుల్లో 54 ఖాతాలు తెరిచారని తెలుసుకుని విస్తుపోయారు. 171 ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ ద్వారా మొత్తం డబ్బును ఖర్చు చేశారని తెలుసుకున్నారు. అయితే ఆ ఇద్దరు యువకులకు గతంలో నేరచరిత్ర లేదని తెలుసుకుని రిమాండ్కు పంపించారు.
Read More Articles |
Cordyceps | భారత్లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన విషయాలు
Avatar 2 ott release date | అవతార్2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్గా మారిన రిలీజ్ డేట్