Atal Bihari Vajpayee | మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ఏడాది వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకుని గ్వాలియర్లో భారీ స్థాయిలో స్మారకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీకి అనుగుణంగా వాజ్పేయి జయంతి సందర్భంగా గ్వాలియర్లో 10వేల ఎకరాల భూమిని మధ్యప్రదేశ్ సర్కారు కేటాయించింది.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలకు అనుగుణంగా గ్వాలియర్లో అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా సిరోల్ ప్రాంతంలో 10 వేల ఎకరాలు కేటాయించారు. అక్కడే వాజ్పేయి స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మున్సిపల్, ఇతర విభాగాలు అనుమతిచ్చాయి. దీనికోసం ఏర్పడిన నజుల్ కమిటీ కూడా ఆమోదం తెలపడంతో లైన్ క్లియర్ అయింది. స్మృతివనానికి అవసరమైన 10వేల ఎకరాల భూమికి పాలనా విభాగం నుంచి పూర్తిగా ఆమోదం లభించినట్లైంది.
డిసెంబర్ 25, 1924లో గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయికి కవిత్వం అంటే ఎంతో ఆసక్తి. భారత ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన వాజ్పేయి పేరిట అరుదైన రికార్డులు ఉన్నాయి. ఆయన నాలుగు రాష్ట్రాల్లో 6 లోక్సభ స్థానాల నుంచి గెలుపొందిన ఏకైక నేత. బీజేపీని ఉన్నత శిఖరాలకు చేర్చి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1996లో మొదటిసారి బీజేపీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు 13 రోజులపాటు ప్రధానిగా వాజ్పేయి సేవలందించారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. తిరిగి 1998లో రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 13 నెలలు పాలించారు. మళ్లీ 1999 నుంచి 2004 వరకు వాజ్పేయి భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సందర్భంలోనే 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష నిర్వహించారు. 1999లో కార్గిల్ యద్ధంలో పాకిస్థాన్పై భారత్కు విజయాన్ని అందించారు. వాజ్పేయి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
Read More Articles |
chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్కు భయం.. ఆయన ఉన్న హోటల్కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు
Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?