Cherial zptc | తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. చేర్యాల మండలం గుర్జకుంటలో సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన మల్లేశాన్ని కొందరు దుండగులు అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో మల్లేశం అక్కడే కుప్పకూలిపోయాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న జడ్పీటీసీని గమనించిన స్థానికులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మల్లేశాన్ని ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. దాడికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read More Articles |
Cordyceps | భారత్లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన విషయాలు
kalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్