Home Latest News SSC Paper Leak | బండి సంజయ్‌ను ఎవరూ ఇరికించలేదు.. ఈటలకు కూడా టెన్త్ పేపర్...

SSC Paper Leak | బండి సంజయ్‌ను ఎవరూ ఇరికించలేదు.. ఈటలకు కూడా టెన్త్ పేపర్ ఫార్వర్డ్ అయ్యింది.. సంచలన విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ

SSC Paper Leak | పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కీలకంగా వ్యవహరించారని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. బండి సంజయ్, ప్రశాంత్ ఇద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సప్ ఛాటింగ్, వాట్సాప్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్నారని.. ఆ తర్వాతే హిందీ పేపర్ లీకేజీకి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. బండి సంజయ్‌పై ఏ1 నిందితుడిగా, బూర ప్రశాంత్‌పై ఏ2గా, గుండబోయిన మహేశ్‌పై ఏ3గా కేసు నమోదు చేశామని తెలిపారు. ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేశ్‌ను చేర్చామని చెప్పారు. ఇప్పటివరకు నలుగుర్ని అరెస్టు చేశామని, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

బండి సంజయ్ ఫోన్ ఇస్తేనే !

కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చిందని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 11:18 గంటలకు ప్రశాంత్ హిందీ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారని తెలిపారు. 11:24 గంటలకు బండి సంజయ్‌కు ప్రశాంత్ ఫార్వర్డ్ చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ పేపర్ చాలామందికి ఫార్వర్డ్ అయ్యిందని తెలిపారు. మహేశ్ కూడా ఈ పేపర్‌ను చాలామందికి పంపించారని చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్, ప్రశాంత్ కుట్ర చేశారని తెలిపారు. బండి సంజయ్ ఫోన్ ఇస్తే తమకు కీలక సమాచారం దొరుకుతుందని వెల్లడించారు. కానీ బండి సంజయ్‌ను ఫోన్ అడిగితే లేదని చెప్పారని అన్నారు.

బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాచుకున్నారు?

బండి సంజయ్ నిర్దోషి అయితే ఫోన్ ఎందుకు దాచుకున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రశ్నించారు. ఫోన్ దాచుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఫోన్ తెస్తే ఎవరు ఏంటో తెలిసిపోతుంది కదా అని స్పష్టం చేశారు. అయినా సరే బండి సంజయ్ ఫోన్ కాల్ డేటా సేకరిస్తామని స్పష్టం చేశారు. వాట్సాప్ మేనేజ్‌మెంట్‌కు రిక్వెస్ట్ పంపి.. వాట్సాప్ చాట్ కూడా రిట్రైవ్ చేస్తామని తెలిపారు.

ఈటలకు కూడా పేపర్ పంపించారు.. ఆయనపై కేసు ఎందుకు పెట్టలేదు?

బండి సంజయ్‌ను కావాలని ఇరికించారనేది అవాస్తవమని వరంగల్ సీపీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. వాట్సాప్ చాట్‌లో జరిగిందే మరుసటి రోజే పేపర్లలో కథనాలుగా వచ్చాయని తెలిపారు. కుట్రపూరితంగా బండి సంజయ్‌ను ఇరికించలేదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌కు కూడా పేపర్ ఫార్వర్డ్ చేశారు. ఈటలతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలకు కూడా ఫార్వర్డ్ అయ్యిందని.. మరి వాళ్లందరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు అనేది అర్థం చేసుకోవాలని సూచించారు. తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాల మేరకు సంజయ్‌ను ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSC Paper Leak | బండి సంజయ్‌ను ఎవరూ ఇరికించలేదు.. ఈటలకు కూడా టెన్త్ పేపర్ ఫార్వర్డ్ అయ్యింది.. సంచలన విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ

Hairsh Rao | పట్టపగలే బండి సంజయ్ దొరికిపోయిండు.. టెన్త్ పేపర్ లీకేజీ కుట్రపై మంత్రి హరీశ్ రావు ఫైర్

Bandi Sanjay | పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఏ-1గా బండి సంజయ్.. రిమాండ్ కాపీలో ఈటల రాజేందర్ పీఏ పేర్లు

Bandi Sanjay | బండి సంజయ్‌పై పెట్టిన కేసులు ఇవే.. ఎఫ్‌ఐఆర్‌లో ఏం పేర్కొన్నారంటే..

Siddipet | సిద్దిపేట అడిషనల్‌ కలెక్టర్‌పై వీధికుక్క దాడి.. వాకింగ్‌ చేస్తుండగా పిక్కపట్టి కొరికేసిన శునకం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Exit mobile version