PM Modi | ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. దాదాపు ఏడాది కావొస్తున్న పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఉక్రెయిన్పై దాడులను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో పుతిన్ను ఆపడం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని అమెరికా అభిప్రాయపడుతుంది. ఇదే విషయంపై అమెరికా వైట్ హౌస్ తాజాగా స్పందించింది.
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి జరిగే ఏ ప్రయత్నాన్ని అయినా స్వాగతిస్తామని వైట్ హౌస్ నేషనల్ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధాన్ని ఆపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ అయితేనే పుతిన్ను ఒప్పించగలరని అన్నారు. కానీ మోదీ ఎందుకు ఇందులో ఆలసత్వం వహిస్తున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. పుతిన్ కూడా ఈ యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సాధ్యమైనంత త్వరగా ఆగిపోవాలని మేము కోరుతున్నామని పేర్కొన్నారు. మాస్కోలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. పుతిన్ తో సమావేశమైన నేపథ్యంలో కిర్బీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులకు పుతిన్ ఒక్కడే కారకుడని తెలిపారు. యుద్ధాన్ని ఆపివేసే బదులు ఆయన ఇంకా మిస్సైళ్లను ప్రయోగిస్తూ ఉక్రెయిన్ వాసులను మరింత కష్టాల పాలు చేస్తున్నాడని కిర్బీ ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధ విరమణకు చేయాల్సిందంతా చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికైనా ఉక్రెయిన్ పై దురాక్రమణనను నిలిపివేయమని పుతిన్ కి చెప్పి ఒప్పించే శక్తి మోదీకి ఉందని పునరుద్ఘాటించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు
KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్
Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం