Niramala Sitharaman | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ( Union Budget 2023-24 ) ప్రవేశపెట్టారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఇదోసారి. దీంతో అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. గత నాలుగేళ్లుగా బడ్జెట్ ప్రసంగం చేస్తున్న నిర్మలా సీతారామన్ పలు రికార్డులు క్రియేట్ చేశారు.
ఆ రికార్డులు ఏంటో చూద్దాం..
➢ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాదు.. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఈమె ఖాతాలోనే ఉంది.
➢ 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్.. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 1970-71లో ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు ఉంది. కానీ ఇందిరాగాంధీ అప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
➢ అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత కూడా నిర్మలా సీతారామన్పైనే ఉంది. 2003-04లో బడ్జెట్ ప్రవేశపెట్టిన జశ్వంత్ సింగ్ 135 నిమిషాలు పాటు ప్రసంగం చేశారు. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్ సమయంలో 137 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.
➢ ఇక 2020-21లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆమె 162 నిమిషాల పాటు ప్రసంగించారు. ఒంట్లో నలతగా ఉండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ చరిత్రలో ఇదే సుదీర్ఘ ప్రసంగం.
ఈ లెక్కన చూసుకుంటే ఈ సారి చేసిన బడ్జెట్ (2023-24) ప్రసంగమే అత్యంత తక్కువ సమయం కొనసాగింది. కేవలం 86 నిమిషాలు మాత్రమే ప్రసంగించింది. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ చేసిన ఐదు బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Income Tax Slabs Budget 2023 | బడ్జెట్లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపన్ను పరిమితి రూ. 7లక్షలకు పెంపు
Union Budget 2023 | బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. బడ్జెట్ హైలెట్స్ ఇవే..
Union Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..
Union Budget 2023 | కేంద్ర బడ్జెట్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా
Fire Accident | అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం