Home News AP TTD EO Dharmareddy | జనవరిలో పెళ్లి.. పత్రికలు పంచుతూ గుండెపోటుతో కన్నుమూసిన టీటీడీ ఈవో...

TTD EO Dharmareddy | జనవరిలో పెళ్లి.. పత్రికలు పంచుతూ గుండెపోటుతో కన్నుమూసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు

TTD EO Dharmareddy | తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ( 28 ) గుండెపోటుతో మృతి చెందారు. జనవరిలో వివాహం జరగాల్సి ఉండగా ఊహించనివిధంగా కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చంద్రమౌళికి తితిదే చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో ఎంగేజ్‌మెంట్ అయింది. జనవరిలో తిరుమలలో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే చంద్రమౌళి గుండెపోటుతో మృతి చెందడం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు పలువురు ప్రముఖులు ధర్మారెడ్డిని పరామర్శించారు.

అసలేం జరిగిందంటే..

పెళ్లి సమయం దగ్గరపడటంతో కుటుంబసభ్యులందరూ ఏర్పాట్లలో మునిగిపోయారు. చంద్రమౌళి బంధువులకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి చెన్నై వెళ్లారు. ఆళ్వారుపేటలోని బంధువులకు కార్డులు ఇవ్వడానికి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కన ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే దగ్గరలోని కావేరి ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించిన ఫలితం లేకపోయిందని, బుధవారం ఉదయం 8.30 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Hero Vishal on YS Jagan | రాజకీయాల్లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విశాల్‌.. ఓటేసే అవకాశమొస్తే జగన్‌కే అంటూ షాకింగ్‌ కామెంట్స్‌

nline Game | ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థి.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

Corona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !

China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

Exit mobile version