Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC Paper Leakage | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఒక్కటే కాదు.. మెయిన్స్‌ లీకేజీకి కూడా స్కెచ్‌.....

TSPSC Paper Leakage | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఒక్కటే కాదు.. మెయిన్స్‌ లీకేజీకి కూడా స్కెచ్‌.. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఎన్నో కుట్రలు

TSPSC Paper Leakage | టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సహా పలు పోస్టులకు సంబంధించిన పేపర్లు లీక్‌ చేసిన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డి భారీ స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొట్టేసిన వాళ్లు.. మెయిన్స్‌ పేపర్‌ కూడా లీక్‌ చేసేందుకు కూడా ప్లాన్‌ చేసినట్లు సిట్‌ విచారణలో వెల్లడైంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డి, రేణుక భర్త ఢాక్యా నాయక్‌, ఆమె సోదరుడు రాజేందర్‌ను సిట్‌ విచారించగా కీలక విషయాలు వెల్లడించారు.

సిస్టమ్‌ హ్యాక్‌ చేసి.. పేపర్‌ లీక్‌

కస్టోడియన్‌ శంకరలక్ష్మీ డైరీ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ దొంగిలించామని ముందుగా చెప్పిన స్టేట్‌మెంట్‌ అబద్ధమని రాజశేఖర్‌ రెడ్డి ఒప్పుకున్నాడు. సిస్టమ్‌ హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ సంపాదించామని వెల్లడించాడు. ప్రవీణ్‌ సిస్టమ్‌ నుంచే కస్టోడియన్‌ సిస్టమ్‌ ఓపెన్‌ చేశామని ఒప్పుకున్నాడు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన 121 మందిని గుర్తించిన సిట్‌ వారిలో 60 మందిని విచారించింది. పేపర్‌ లీకేజి ఘటనలో సోమవారం మరో వ్యక్తిని సిట్‌ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది.

ఒకరికి తెలియకుండా మరొకరి ఎత్తులు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసి సక్సెస్‌ కావడంతో ఏఈ ప్రశ్నపత్రం లీక్‌ చేసి భారీగా డబ్బులు సంపాదించాలని ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి స్కెచ్‌ వేశారు. ఈ క్రమంలోనే రేణుకకు పేపర్‌ ఇచ్చి రూ.10 లక్షలు తీసుకున్నారు. ఇంకా మెయిన్స్‌ రాయాల్సి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ఎవరికైనా తెలిస్తే అందరం దొరికిపోతాం.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని రేణుకకు వాళ్లు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. కానీ రేణుకకు తెలియకుండా ఆమె భర్త ఢాక్యా నాయక్‌, సోదరుడు రాజేశ్వర్‌ పెద్ద స్కెచ్‌ వేశారు. ఈ పేపర్‌ను బయట అమ్మి భారీగా సొమ్ము చేసుకోవాలని ఆశపడ్డారు. దీంతో జాతీయ ఉపాధి హామి పథకంలో పనిచేసే కాంట్రాక్టర్‌ తిరుపతయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అతని ద్వారా ప్రశాంత్‌ రెడ్డి, రాజేందర్‌ కుమార్‌ను సంప్రదించి రూ.17.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News