Home Latest News Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

Hyderabad tragedy | పండుగ పూట విషాదం నెలకొంది. తల్లీకూతుళ్లతో పాటు కన్నతల్లిని చంపేసి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంక్రాంతి రోజంతా ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. ఈ విషాద ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని తార్నాకలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ప్రతాప్ ( 34) ఓ కారు షోరూంలో డిజైన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సింధూర (32) ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్. వీరికి నాలుగేళ్ల కూతురు ఆద్య ఉంది. వీరు హైదరాబాద్‌లోని తార్నాకలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు ప్రతాప్ తల్లి రాజతి కూడా ఉంటుంది. నిన్న ( ఆదివారం ) సంక్రాంతి రోజు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. పైగా తలుపులు కూడా తీయలేదు. రోజంతా తలుపులు వేసి ఉండటంతో సోమవారం అనుమానం వచ్చి పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. అయితే ముగ్గురిని గొంతి నులిమి చంపిన తర్వాత ప్రతాప్ ఉరివేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సింధూర, ప్రతాప్ మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటాయని అపార్ట్‌మెంట్ వాసులు పేర్కొంటున్నారు. దీంతో కుటుంబ కలహాల కారణంగానే ప్రతాప్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన

Ratan Tata | తనకు ఇష్టమైన కారు గురించి రతన్ టాటా భావోద్వేగపు పోస్టు.. నెట్టింట వైరల్!

Exit mobile version