Harishrao | తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ తీసుకుంటున్న చర్యలకుగాను కేంద్రం రెండు అవార్డులు ప్రకటించింది. గర్భిణుల సంరక్షణకు అనుసరిస్తున్న విధానాలు అత్యుత్తమమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ కొనియాడింది.
మాతృమరణాలను పూర్తిగా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతులమీద తెలంగాణ ప్రభుత్వం తరఫున మెటర్నల్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ పద్మజ అవార్డులు అందుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకున్నారు.
తెలంగాణలో ప్రసవ సేవలను మెరుగుపరిచేందుకు గానే దేశంలోనే తొలిసారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాదు హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి, చికిత్స అందించడంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాంలో నిలిచింది.
తెలంగాణకు రెండు అవార్డులు రావడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్లే అవార్డులు వచ్చాయని అన్నారు.
Read More Articles |
BRS Party | ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్.. హాజరైన అఖిలేష్ యాదవ్, కుమారస్వామి
Nirbhaya Fund | ఎమ్మెల్యేల రక్షణకు నిర్భయ వాహనాలు.. షిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ లోక్సభలో కీలక ప్రకటన..