Home Latest News Amit shah comments on congress | చైనా నుంచి కాంగ్రెస్ సంస్థకు డబ్బులు అందాయి.....

Amit shah comments on congress | చైనా నుంచి కాంగ్రెస్ సంస్థకు డబ్బులు అందాయి.. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

Amit shah comments on congress | కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit shah ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్-చైనా ఘర్షణలపై స్పందించిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఒకవైపు 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే.. మరోవైపు చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు డబ్బులు చేరాయంటూ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని స్పష్టం చేశారు.

లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడంపై స్పందించిన అమిత్ షా తాజా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్-చైనా ఘర్షణపై రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని చెప్పినా ప్రశ్నోత్తరాల సమాయాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సంబంధించిన FCRA రద్దు గురించి వేసిన ప్రశ్న రాకుండా ఉండేందుకే సరిహద్దు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో లేవనెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపైన కూడా సమాధానమిస్తామన్న అమిత్ షా.. 2005-06, 2006-07 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ పౌండేషన్ రూ. 1.35 కోట్ల గ్రాంట్ పొందినట్లు వెల్లడించారు. అది FCRA నిబంధనలకు విరుద్ధమని, అందుకే దాని రిజిస్ట్రేషన్ ను రద్దు చేశామన్నారు. చైనామీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

మరోవైపు భారత్-చైనా సరిహద్దులోని తవాంగ్ సెక్టార్ వద్ద జరిగిన ఘర్షణపై లోక్ సభలో రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. అయితే భారత సైనికులు ( Indian Army ) వారి ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టారని ప్రకటించారు. మన సైనికుల్లో ఎవరికీ గాయాలు కాలేదని అన్నారు. మన సైనికుల సేవలను అభినందిస్తూ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. మన భూభాగాన్ని కాపాడేందుకు భారత సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Congress political crisis | కాంగ్రెస్ కు రోగమొచ్చింది.. దాన్ని నయం చేయాల్సిందే.. దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు

India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో కీలక ప్రకటన..

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

RRR | ఆర్ఆర్‌ఆర్ సినిమాకు క్యూ కడుతున్న అంతర్జాతీయ అవార్డులు.. రాజమౌళితో పాటు దుమ్మురేపుతున్న కీరవాణి

Exit mobile version