Teenmar Mallanna | గత కొంత కాలంగా బీఆర్ఎస్ వర్గాల వారికి పంటి కింద రాయిలా ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయనకు సంబంధించిన క్యూ న్యూస్ ఆఫీస్ పై ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాదాపు 25 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఫిర్జాదిగూడలోని ఆఫీస్ లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న. ఆయన ఫిర్యాదు మేరకు క్యూన్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకొని స్థానికులు చితకబాదినట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్, కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీమ్ తెలిపింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లన్న టీమ్ డిమాండ్ చేస్తోంది.
తాను బయటకు వెళ్లినప్పుడు వచ్చి ఆఫీసుపై దాడి చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని మలన్న ఆరోపించారు. నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని మల్లన్న చెప్పారు. పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని మల్లన్న అన్నారు. నాలుగు సార్లు క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి జరిగినా…వార్తలు ఆగలేదన్నారు. ఆఫీసు ఖాళీ చేయించాలని తమ ఆఫీసు ఓనర్ ను పోలీసులు బెదిరిస్తున్నారని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Rain Alert | వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో మరో 2 రోజులు, ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల