Viral News | పెళ్లి అయిన తరువాత అత్తారిల్లు ఎంత దూరమైన సరే పెళ్లి కూతురు అక్కడికి వెళ్లాల్సిందే. కానీ ఇక్కడ ఓ వధువు మాత్రం మెట్టినిల్లు చాలా దూరంగా ఉందని ఓ ఏడుపు లంకించుకుంది. దాంతో ఏమి చేసేదేమి లేక అత్తింటి వారు ఆమెను తీసుకుని వచ్చి పుట్టింటి దగ్గర వదిలిపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ వారణాసికి చెందిన ఓ యువతికి రాజస్థాన్ కి చెందిన యువకుడితో ఇటీవల పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. అప్పగింతల తర్వాత వధువును తీసుకుని అత్తింటి వారు కారులో బయల్దేరారు. కొద్దిదూరం వెళ్లే వరకు పెండ్లి కూతురు బాగానే కూర్చుంది. తన పుట్టింటి వారి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అలా కూర్చుంటే ఎంతసేపు అయినా మెట్టినిల్లు రాకపోవడంతో ఆమెకు లోలోపల భయం పెరిగిపోయింది. ఇంకా ఎంత దూరం వెళ్లాలో అని మదనపడింది.. మళ్లీ తన పుట్టినింటి వాళ్లను చూడాలంటే ఇంత జర్నీ చేయాల్సి ఉంటుందా అని తన మెదడులో వందలాది ప్రశ్నలు మెదిలాయి. అవన్నీ ఆలోచిస్తుంటే దు:ఖం పొంగుకొచ్చింది. ఒక్కసారిగా ఏడుపు లంకించుకుంది. అత్తగారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను రాను.. మా పుట్టినింటికి వెళ్లిపోతా అంటూ పెద్ద పెట్టున ఏడవసాగింది. కారు ఆపాలంటూ పట్టుబట్టింది. వధువు చేష్టలతో వరుడు, అతని బంధువులు షాకై.. తమ కార్లను ఆపేశారు. కారు ఆగగానే రోడ్డుపై దిగేసి మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. ఆమెను ఓదార్చలేక వరుడి కుటుంబీకులు తలలు పట్టుకున్నారు.
పెళ్లి దుస్తుల్లో హైవే పక్కన ఏడుస్తూ ఉండటంతో అక్కడ కలకలం రేగింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వాహనదారులు తమ కార్లు రోడ్డు మీదే నిలిపేయడంతో హైవేపై వాహనాలు బారులుతీరాయి. ఇదంతా చూసి పెళ్లికొడుక్కి దిమ్మతిరిగినంత పనైంది. ఈ విషయం మహరాజ్పూర్ పోలీసులకు తెలియడం వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి తరపు వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను పుట్టింటికి తిరిగి వెళ్లిపోతానని వధువు తేల్చి చెప్పడంతో మహిళ పోలీసుల సాయంతో ఆమెను జాగ్రత్తగా పంపించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల