Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsCM KCR | బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్‌...

CM KCR | బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

CM KCR | బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగుజిలుగులు భారతదేశాన్ని తయారు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో 4 లక్షల మెగా వాట్ల కరెంటు అందుబాటులో ఉందని చెప్పిన కేసీఆర్‌.. 2.10 లక్షల మెగా వాట్లకు మించి కరెంట్‌ను వాడలేదని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా 24 గంటల కరెంట్‌ ఇచ్చింది లేదని అన్నారు.

రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాలని అడిగితే దానికి 96 కథలు చెబుతరు.. దోపిడీదారులు అన్నట్టు, రేవ్‌డీ కల్చర్‌ అని, ఉచితాలు అని పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూసి సిగ్గుపడాలని అన్నారు. ఇంత సంపద, ఇంత భూమి ఉన్న దేశంలో రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని 13 నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేసే దుస్థితా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా దేశాన్ని పాలించే విధానం.. ఇదేనా మోసం.. ఇదేనా దగా? అంటూ మండిపడ్డారు. పెట్టుబడిదారులకు మాత్రం ఎన్‌పీఏ పేరిట లక్షల కోట్లు దోచిపెడుతున్నారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే భారత దేశం మొత్తానికి ఉచిత కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. దేశమంతటా ఉచిత కరెంట్‌ ఇవ్వడానికి లక్ష 45వేల కోట్లు మాత్రమే అవసరం అవుతాయని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు వంటి స్కీమ్‌ భారత దేశమంతటా అమలు చేయడమే బీఆర్‌ఎస్‌ పార్టీ నినాదం, డిమాండ్‌ అని తెలిపారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టామని చెప్పారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు

CM KCR | ఖమ్మంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం : అఖిలేశ్‌ యాదవ్‌!

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News