CM KCR | ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పది వేల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్దతండా, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి వంటి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి వీటిని ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మంతో పాటు మధిర, వైరా, సత్తుపల్లికి రూ. 30 కోట్ల చొప్పున కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. ఖమ్మంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్పై కేరళ సీఎం ప్రశంసలు