CM KCR | ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ఈ హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్కు సూచించారు. ఒకవేళ ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రభుత్వమే భూమిని సేకరించి.. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆదేశించారు. రిపోర్టలకు మాత్రమే కాదు ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్పై కేరళ సీఎం ప్రశంసలు