IT Rides | హైదరాబాద్లోని పలు సంస్థలపై ఐటీ శాఖ మరోసారి పంజా విసిరింది. బుధవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, సినిమా ఫైనాన్సియర్ల ఇండ్లపై సోదాలు చేస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్థల డైరెక్టర్లు, సీఈవోలు, ప్రతినిధులు వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
కూకట్ పల్లిలోని లోధా అపార్ట్మెంట్స్లోని ఊర్జితా కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కోటా రెడ్డి, అతని కుమారుడు ఆదిత్య, సీఎస్కే బిల్డర్స్, బిల్డర్ మాధవరెడ్డి కార్యాలయాలు, ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 50 ఐటీ శాఖ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. ఐటీ రిటర్న్స్ లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అధికారులు తాజాగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడలో కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ వివరాలలను అకౌంట్ రిపార్ట్ మెంట్ల నుంచి తీసుకొని విచారిస్తున్నారు.
ఇటీవల ఎక్సెల్ గ్రూపు కంపెనీలపైనా ఐటీ బృందాలు దాడులు చేశాయి. దానికి అనుబంధంగా ఉన్న పది కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. నార్సింగ్లో ఆరు చోట్ల, బాచుపల్లి, దుండిగల్ లోని నాలు కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. లండన్ నుంచి 500 కోట్ల నిధులు ఎక్సెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఐటీ శాఖ జనవరి 4న సోదాలు నిర్వహించింది. తాజాగా మరోసారి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్ల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయడం కలకలం రేపుతోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
CM KCR | బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు
Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్పై కేరళ సీఎం ప్రశంసలు