Chandra babu Road show | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో అపశృతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగింది. ఏడుగురు కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్ షో ప్రాంగణం ఆర్తనాదాలతో దద్దరిల్లి పోయింది. తొక్కిసలాట జరిగిన సమయంలో కొందరు పక్కనున్న కాలువలో పడిపోయారు.
ప్రమాద ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన విషయం తెలుసుకున్న చంద్రబాబు.. రోడ్ షో మధ్యలోనే ఆపేసి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
మృతుల వివరాలివే..
కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో దేవినేని రవీంద్ర (ఆత్మకూరు), కలవకురి యానాది (కొండముడుసుపాలెం), యటగిరి విజయ (ఉలవపాడు ), కకుమాను రాజా (కందుకూరు ), మరలపాటి చిన్నకొండయ్య (గుళ్ల పాలెం ), పురుషోత్తం (కందుకూరు ) మృతి చెందినట్టు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More Articles |
Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత
Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!