Naveen Murder Case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై నిందితుడు హరిహర కృష్ణ తండ్రి సంచలన వ్యాఖ్యాలు చేశాడు. ఒకవైపు నవీన్ను పక్కా ప్లాన్ ప్రకారమే హరి హర కృష్ణ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంపై తనకు పూర్తి అవగాహన ఉండటంతో హత్య చేసేందుకు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హరిహర కృష్ణ తండ్రి వాదన మరోలా ఉంది.
తన కుమారుడు ఒక్కడే ఈ హత్య చేసి ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేశాడు. మద్యం మత్తులో హత్య జరిగి ఉంటుందని, ఈ హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉండడని అన్నాడు. హత్య వెనుక మరికొందరి హస్తం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కొడుకు కొందరితో కలిసి రూం తీసుకుని ఉంటున్నాడని, వారెవరో తెలుసుకుని వారిని కూడా విచారించాలని హరి హర కృష్ణ తండ్రి అంటున్నాడు.
హత్య చేసిన తన కొడుక్కు కోర్టు ఏ శిక్ష విధించినా సరేనని, అయితే తన కొడుకుతో పాటు హత్యకు కారణమైన అందరికీ శిక్ష పడాలన్నారు. అంతకుముందు నవీన్ కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలిపాడు.
కాగా, నవీన్ను హత్య చేసిన తర్వాత వరంగల్లోని తండ్రి దగ్గరకు హరిహర కృష్ణ వెళ్లాడు. అప్పటికే నవీన్ కనిపించకపోవడంతో వరుస కాల్స్ వస్తున్నాయి. అక్కడే ఉంటే తండ్రికి విషయం తెలుస్తుందని హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే నవీన్ను హత్య చేసిన విషయాన్ని హరిహర తన ప్రియురాలికి చెప్పాడు. ఆమె కూడా అతనికి లొంగిపొమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. నార్కట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టడం.. అతని అక్క, బావలను ప్రశ్నించడంతో హత్య విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. తండ్రి సూచనల మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దానికి ముందు తన ఫోన్ డేటాను హరి హర కృష్ణ తొలగించాడు. డేటాను రికవరీ చేసేందుకు పోలీసులు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్ చేసి బాధపడ్డ ప్రీతి
Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు
Medical Student Preethi | మెడికల్ విద్యార్థి ప్రీతి కన్నుమూత.. ప్రకటించిన నిమ్స్ ఆస్పత్రి వైద్యులు