Home News AP Narendra Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా.. కారణమేంటి?

Narendra Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా.. కారణమేంటి?

Image Source: PMO India facebook

Narendra Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న సికింద్రాబాద్‌లో మోదీ వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉంది. అయితే పర్యటన వాయిదా పడినట్లు ప్రధాని మోదీ కార్యాలయం వెల్లడించింది. మోదీ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది సమాచారం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పీఎంవో కార్యాలయం సమాచారం అందించింది. షెడ్యూల్‌లో మార్పుల కారణంగానే మోదీ పర్యటన వాయిదా పడినిట్లు సమాచారం.

ఈనెల 19న సికింద్రాబాద్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు సికింద్రాబాద్- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టాల్సి ఉంది. అలాగే పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, రాష్ట్ర పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Youtube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

IRCTC Train Ticket | జర్నీలోనే మీ స్లీపర్‌ టికెట్‌ను ఏసీ కోచ్‌లోకి మార్చుకోవాలా? ఇలా చేస్తే సరి !!

Inavolu Mallanna Jatara | తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జాతర ఐనవోలు.. దీని విశిష్ఠత ఏంటి? అన్నిటికంటే ఈ జాతర ఎందుకు ప్రత్యేకం?

Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

Exit mobile version