Viral news | భార్యాభర్తలు ఇద్దరూ అలా బయటకు వెళ్లారు.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు.. పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి బయల్దేరారు.. అలా వెళ్తుండగా ఒక్కసారిగా భర్తను భార్య గట్టిగా పిలిచింది. ఏమండీ.. మన ఇల్లు ఇటు వైపు కాదు కదా.. ఎటు తీసుకెళ్తున్నారని ప్రశ్నించింది. అంతే ఒక్కసారిగా భర్త షాకయ్యాడు. సరిగ్గానే వెళ్తున్నా కదా ఎందుకు ఇలా అడుగుతుందని అనుమానం.. భార్య గొంతులో ఏదో తేడా వచ్చిందన్న భయం.. ఒక్కసారిగా బైక్ను పక్కకు ఆపి చూస్తే భార్య మారిపోయింది. తన భార్య ఉండాల్సిన చోట ఎవరో మహిళ ఉంది. అంతే ఆ భర్త గుండెలు ఆగినంత పనైపోయింది. తన భార్య ఏమైందోనన్న కంగారు.. ఎవరి భార్యనో తన బైక్ ఎక్కిందన్న భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని ఏమైందా అని ఆలోచిస్తే.. అసలు విషయం తెలిసొచ్చింది. పెట్రోల్ బంక్ దగ్గర తన భార్యకు బదులు వేరొకరి భార్యను ఎక్కించుకున్నా అని తెలిసి హడావుడిగా అక్కడికి పరుగులు పెట్టాడు. కర్ణాటకలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే… కర్నాటకలోని హవేరి జిల్లా రాణేబెన్నూరులో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భార్యతో కలిసి బండికి పెట్రోలు పోయించుకునేందుకు బంక్ వద్దకి వెళ్లిన వ్యక్తి.. తన భార్యని దిగి అక్కడే ఉండమని క్యూలోకి వెళ్లాడు. తర్వాత పెట్రోల్ కొట్టించుకుని అక్కడే నిలబడి ఉన్న మహిళను బండి ఎక్కమన్నాడు. పిలిచింది తన భర్తే అని ఆమె బైక్ ఎక్కింది. కానీ కొంత దూరం వెళ్లాక ‘ఏమండీ.. మన ఇల్లు ఇటు కాదు కదా..? ఇటు వైపు ఎందుకు తీసుకువెళుతున్నారు?’ అని వెనుక నుంచి ఆమె అడిగింది. దాంతో ఏంటీ నా భార్య ఇలా మాట్లాడుతోందని వెనక్కు తిరిగి చూస్తే వెనుక కూర్చున్నావిడ తన భార్య కాదని తెలుసుకుని, నాలుక కరచుకున్నాడు.
తన భార్య ధరించిన రంగు చీరే కట్టుకుని ఉండటంతో బైకు ఎక్కినావిడ తన భార్యే అని ఆయన అనుకున్నారు. భర్త లాంటి బైకు.. అదే సౌష్ఠవం.. తెల్ల చొక్కా.. ఒకే రంగు హెల్మెట్ ఉండడంతో ఆమె కూడా తన భర్తే అని పొరపాటు పడింది. జరిగిన పొరపాటు అర్థమైన కొన్ని నిమిషాలలోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంకు దగ్గరకు తీసుకు వచ్చాడు. అప్పటికే ఆయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. హెల్మెట్ కారణంగా పొరపాటు జరిగిందని తెలుసుకుని వారితో పాటు, బంకులో ఉన్న వారూ పడిపడి నవ్వుకున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం
Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
Bandi Sanjay | సచివాలయం డోమ్లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు