Nagma | గత కొంత కాలంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజల్లో ఎంత చైతన్యం కలిగించినప్పటికీ వీటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి సామాన్యులు మాత్రమే కాదు.. పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు, సినీనటులు కూడా ఒక్కోసారి బలౌతుంటారు. తాజాగా సినీయర్ నటి, పొలిటిషియన్ నగ్మా సైబర్ ఉచ్చులో చిక్కుకున్నారు.
రూ. లక్ష వరకు నగ్మా మోసపోయారు.
నగ్మా మొబైల్కి తాజాగా ఓ లింక్ వచ్చింది. మొదట దానిపై క్లిక్ చేసింది. అనంతరం ఓ వ్యక్తి ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయడానికి సమాచారం అడిగాడు. కానీ, అతన్ని అనుమానించిన నగ్మా వివరాలను తెలపలేదు. అయినప్పటికీ రూ.1 లక్ష వరకు కొట్టేశారని తెలిపారు. దీంతో అప్రమత్తమైన నగ్మా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. అందులో.. ఆమెకి ప్రైవేట్ నంబర్ నుంచి కాకుండా బ్యాంకుల పంపించేటట్లుగానే సందేశం వచ్చినట్లు తెలియజేశారు. ఆమె కాకుండా అదే బ్యాంకుకి సంబంధించిన మరో 80 మంది వినియోగదారులు సైతం ఇలాగే మోసపోయినట్లు తెలిసింది. దీంతో కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అనంతరం నగ్మా మాట్లాడుతూ.. ‘ఆ నేరగాళ్లు నా ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి.. బెనిఫియరీ ఖాతాను సృష్టించారు. అనంతరం రూ. 1 లక్షను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ సమయంలో నాకు దాదాపు 20 వరకు ఓటీపీలు వచ్చాయి. అదృష్టం ఉండడం వల్ల అందులో తక్కువ మొత్తమే నష్టపోయాను’ అని చెప్పుకొచ్చారు
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!
Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!