Viral News | ఈ మధ్య దొంగలు బాగా తెలివిమిరిపోయారు. ముందు మనిషి ఉండగానే.. వెనుక చక్కగా వారి పని కానిచ్చేస్తున్నారు. కనీసం చోరీ జరిగినట్లు దాని తాలుకా మనిషికి కూడా తెలియకుండా నొక్కేస్తున్నారు. అచ్చం ఇలాంటి చోరీనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. మార్చి 1న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట సమీపంలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి బ్యాగులో రూ. 40లక్షల నగదు పెట్టుకొని బైక్ పై రావడాన్ని ముందుగానే గమనించిన ముగ్గురు దొంగలు అతడిని కొంతదూరం అనుసరించారు. మార్గమధ్యలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగిందో లేదో వెనక నుంచి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బండి మీద ఉన్న వ్యక్తి ముందు సిగ్నల్ చూస్తుండగానే దొంగల్లో ఓ వ్యక్తి వెనుక బ్యాగ్ జిప్ తెరిచాడు. మరోవ్యక్తి అందులోని డబ్బుల బ్యాగ్ తీసుకుని ఇంకొకరికి అందించాడు. క్షణాల్లో పని ముగించుకుని ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో డబ్బులున్న బ్యాగ్ను ఆ వాహనదారుడు భుజానికే తగిలించుకుని ఉన్నాడు.
అయినా అతడు చోరీని గమనించలేదు. అంతేనా… ఆ సమయంలో బైక్ పక్కనే కార్లు కూడా ఆగి ఉన్నాయి. బైక్ ముందు నుంచి కొందరు పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయినా ఏ ఒక్కరూ దొంగతనాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. దొంగల నుంచి రూ.38 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు ద్విచక్రవాహనదారులను లక్షంగా చేసుకుని చోరీలకు పాల్పడే ముఠా అని పోలీసులు వెల్లడించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ
Amitabh Bachchan | ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్లో అపశ్రుతి.. అమితాబ్ బచ్చన్కు గాయాలు
Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!