Tripura CM | పొరపాటున డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొందరు అంటుంటారు. కానీ ఇప్పుడున్న చాలామంది డాక్టర్లయ్యాక యాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టరే. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా వైద్యురాలే. మొన్నామధ్య విమానంలో ఒక ప్రయాణికుడికి గవర్నర్ చికిత్స చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బాలుడికి ఆపరేషన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ డాక్టర్.
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్వతహాగా డాక్టర్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పచ్చగౌన్ వదిలేసి పక్కా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. తెల్లచొక్కాలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఓ బాలుడి కోసం మళ్లీ పచ్చ గౌన్ వేసుకున్నారు. బాలుడికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
హపానియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఓ బాలుడికి ముఖ్యమంత్రి డెంటల్ సర్జరీ చేశారు. ఆయనతో పాటు మరికొందరు వైద్యులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మాణిక్ సాహా రాజకీయాల్లోకి రాకముందు ఇదే ఆస్పత్రిలో పని చేశారు. ఏడు నెలల ముందే ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బాలుడికి సర్జరీ చేసి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో వైరల్గా మారారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Breaking news | ఏపీలో సంక్రాంతి సంబరాల్లో అపశృతి… ముగ్గురు విద్యార్థులకు అంటుకున్న భోగి మంటలు..!!