Viral News | పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్యను ప్రేమగా చూసుకునే వారు కొందరైతే, రాచిరంపాన పెట్టేవారు మరి కొందరు. కానీ ఇక్కడ ఓ భర్త తన భార్య అడిగిందని ఏకంగా రూ. 7 కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించి వార్తల్లో నిలిచాడు.
ఒడిశాకు చెందిన ఖేత్రవాసి.. ఆయన భార్య పేరు బైజంతి. బైజంతి సంతోషి మాతకు గొప్ప భక్తురాలు. దీంతో ఆమెకు తమ గ్రామంలో ఒక గుడి కట్టించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయింది. దాని గురించి ఆమె తన భర్తకు చెప్పగా ఆయన సుమారు రూ. 7 కోట్లు ఖర్చు చేసి గ్రామంలో సంతోషి మాత ఆలయాన్ని నిర్మించాడు.
దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించడం చెప్పుకోదగిన విషయం. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఖేత్రవాసి హైదరాబాద్లో వ్యాపారవేత్త. ఈ ఆలయ నిర్మాణం 2008లో ప్రారంభం కాగా.. ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయింది. ఈ ఆలయంలో సంతోషి మాత విగ్రహంతో పాటు శివుడు, వినాయకుడు, హనుమంతుడు, నవగ్రహ దేవతలను కూడా ప్రతిష్ఠించనున్నారు.
గుడిని నిర్మించి తన కల నేర్చినందుకు తానెప్పుడూ తన భర్తకు కృతజ్ఞురాలిగా ఉంటానని బైజంతి తెలిపారు. ముందుగా చిన్న గుడి కట్టాలనుకున్నామని.. కానీ ఆ దేవుడి ఆశీస్సులతో గ్రామంలో అందమైన, పెద్ద ఆలయాన్ని నిర్మించామని ఆమె చెప్పారు. తన కోరిక నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Doctor Preethi | డాక్టర్ ప్రీతి కేసులో కీలక మలుపు.. లభించిన ఆధారం!
WPL 2023 | అవే సీన్స్ రిపీట్.. ఐపీఎల్ ఆరంభ పోరులో జరిగినట్లే ఇప్పుడు డబ్ల్యూపీఎల్లోనూ జరిగాయి !
WPL 2023 | డబ్ల్యూపీఎల్ తొలి సీజన్కు అదిరిపోయే ఆరంభం.. బోణీ కొట్టిన ముంబై
Manchu Manoj | సైలెంట్గా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్