Pawan Kalyan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనకు కారణమైన చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే సంతాపం ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీకి జనసేన బీ టీమ్ అని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడని మరోసారి రుజువు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు నగరంలో తెలుగు దేశం పార్టీ, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనతా వస్త్రాలు, కానుకల కోసం వచ్చిన ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం దిగ్భ్రాంతి కలుగజేసిందని వాపోయారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట కారణంగా ఎనిమిది మంది మృతి చెందిన ఘటన మరువకముందే గుంటూరులో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగించిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చారు.. పోలీసులు కూడా తగు భద్రతలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
బాబు పేరు లేకపోవడంపై నెటిజన్ల ట్రోల్స్
ఈ ప్రెస్మీట్లో చంద్రబాబు పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా చంద్రబాబు స్వయంగా పాల్గొన్న కార్యక్రమం అయినప్పటికీ.. ఇందులో ఆయన పేరు ప్రస్తావించకపోవడం పట్ల ధ్వజమెత్తుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుష్కరాల్లో భక్తులు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదని గుర్తు చేసిన నెటిజన్లు.. ఇప్పుడు గుంటూరులో పేద ప్రజలు చనిపోతే మాత్రం కనీసం బాబు పేరు కూడా ఎత్తడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటం గ్రామంలో గోడలు కూలిస్తే నానా యాగీ చేసిన నువ్వు.. తొక్కిసలాటలో ప్రాణాలు పోతే శాంతి వచనాలు ఎందుకు చెబుతున్నావంటూ మండిపడుతున్నారు.
Read More Articles:
Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?
Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?